ప్ర‌జ‌లు బాధ‌ప‌డుతున్నారు

  • ఎందుకు జ‌గ‌న్‌ను వ‌దులుకున్నామా..?
  • చంద్ర‌బాబును ఎందుకు ఎన్నుకున్నామా..?
  • కూట‌మి ప్ర‌భుత్వ బ‌డ్జెట్ లో సూప‌ర్‌ సిక్స్ హామీల‌కు మొండిచేయి
  • ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై ఎమ్మెల్సీ చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి విమ‌ర్శ‌లు

కూటమి ప్రభుత్వం.. బడ్జెట్ లో సూపర్ సిక్స్ హామీలకు మొండి చెయ్యి మిగిల్చిందని.. నెల్లూరు నగరంలో అభివృద్ధికి బదులుగా.. తన సంస్థ ఉద్యోగులకు లబ్ధి చేకూర్చే విధంగా మూడు నియోజకవర్గ ప్రజలకు మంత్రి నారాయణ అన్యాయం చేస్తున్నారని నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జ్, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిప‌డ్డారు. ఈమేర‌కు ఆయ‌న బుధ‌వారం సాయంత్రం నెల్లూరు న‌గ‌రం.. మాగుంట‌లేఅవుట్‌లోని వైసీపీ జిల్లా పార్టీ కార్యాల‌యంలో మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
చంద్రబాబు నాయుడు గత ఐదేళ్లలో 2 లక్షల 50 వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే.. జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ల కాలంలో ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి కేవలం 3ల‌క్ష‌ల‌30వేల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేశారని ఈ సంద‌ర్భంగా చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి తెలిపారు. ఎందుకు జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని వ‌దులుకున్నామా..? చంద్ర‌బాబునాయుడు అబ‌ద్ధ‌పు హామీల‌ను ఎందుకు న‌మ్మామా అని నేడు ప్ర‌జ‌లు ఆలోజిస్తున్నార‌ని అన్నారు. ఇంకా ప‌లు ప‌థ‌కాల పేరుతో చంద్ర‌బాబునాయుడు ప్ర‌జ‌ల‌ను మోసం చేశార‌ని.. ఆయా వివ‌రాల‌ను వెళ్ల‌డిస్తూ.. చంద్ర‌బాబుపై ప‌లు విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *