నిజం… ఒట్టు అవి ప్ర‌భుత్వ కార్యాల‌యాలే…

  • కొడ‌వ‌లూరులో అడవిని తలపిస్తున్న ప్రభుత్వ కార్యాలయాలు
  • చుట్టు క‌మ్మేసిన కంప‌చెట్లు, ముళ్ల‌పొద‌లు
  • కార్యాల‌య ఆవ‌ర‌ణ‌లో విష‌పురుగుల సంచారం
  • అక్క‌డికి రావాలంటే భ‌య‌ప‌డుతున్న ప్ర‌జ‌లు
  • భ‌యం గుప్పెట్లో విధులు నిర్వ‌హిస్తున్న సిబ్బంది
  • ఇక‌నైనా జిల్లా ఉన్న‌తాధికారులు స్పందించాల‌ని కోరుతున్న ప్ర‌జ‌లు
  • అడవిని తలపిస్తున్న ప్రభుత్వ కార్యాలయాలు..
  • అసలు ఆ కార్యాలయాల్లో అధికారులు ఉన్నారా…
  • ఉంటే ఇంతలా చెట్లు పొదలు ఏంటి అంటున్న కార్యాలయాల‌కి వచ్చే ప్రజలు
  • డ్యూటీకి వచ్చామా, వెళ్ళామా కార్యాలయ చుట్టుపక్కల పరిసరాలతో మనకేంటి అవసరం అన్నట్టుగా అధికారులు..
  • విషపూరితమైన పాములు పురుగులకు స్థావరం ఆ కార్యాలయాలు..
  • ఆ కార్యాలయాలకు పోవాలంటే భయపడుతున్న మండల ప్రజలు..
ఇదీ నెల్లూరు జిల్లా కొడవలూరు మండల కేంద్రంలోని మెయిన్ రోడ్డును ఆనుకుని ఉన్న ప్ర‌భుత్వ కార్యాల‌యాల దుస్థితి. నిజం ఒట్టు అవి ప్ర‌భుత్వ‌కార్యాలయాలంటే ఒక్క‌రు కూడా న‌మ్మ‌డం లేదంటే ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఒకే ఆవ‌ర‌ణ‌లో హోసింగ్, వెలుగు, తహసీల్దార్, వెటర్నరీ ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి.అయితే ఇక్క‌డి అధికారుల ప‌ర్య‌వేక్ష‌ణ లోపం కార‌ణంగా ఆ ప్రాంగ‌ణ‌మంతా ఓ అడ‌విని త‌ల‌పిస్తోంది. మీరు ఒక‌సారి అక్క‌డికి వెళ్లితే మ‌నం అడ‌విలో ఉన్నామా అన్న ఫీలింగ్ ఖ‌చ్చితంగా క‌లుగుతుందంటే అతిశ‌యోక్తి కాదు సుమ‌.దీంతో ప‌లువురు ప్ర‌జ‌లు మ‌నం అడవిలో ఉన్నాయా లేక ఊరిలో ఉన్నాయా అన్నట్లు బ‌హిరంగంగానే చెవులు కొరుక్కుంటున్నారు. ఆ ప్ర‌భుత్వ‌ కార్యాలయాలకు పోవాలంటే భయం భయంగా వెళ్లాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది.ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాలు కనిపించకుండా ప్రాంగ‌ణ‌మంతా పిచ్చి చెట్లు.. గడ్డితో  నిండిపోయి ఉంది. దీంతో ఆ ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణంలో విషపూరితమైన పాములు, పురుగులు సంచ‌రిస్తున్నాయి.

ఇంత‌టి ధీన‌మైన ప‌రిస్థితిని చూసి అటుగా రోడ్డున పోయేవారు అసలు ఇక్కడ అధికారులు ఉన్నారా?... ఉంటే ఈ కార్యాలయాలు ఎందుకు ఇలా ఉన్నాయి?... అధికారులకు పరిసరాల మీద కనీస బాధ్యత లేదా అంటున్న బ‌హిరంగంగానే ప్ర‌శ్నిస్తున్నారు.. ఇదిలా ఉంటే ఆ కార్యాల‌యాల్లో ప‌ని చేసేవారు సైతం బిక్కుబిక్కు మంటూ విధులు నిర్వ‌హించాల్సిన ప‌రిస్థితి ఉంద‌ని వాపోతున్నారు. అన్నీ ప్ర‌భుత్వ కార్యాల‌యాలు ఉన్న ఆ ప్రాంగ‌ణమంతా అడ‌విని త‌లపిస్తుండ‌డంతో ప్ర‌జ‌లు వ‌చ్చేందుకు కూడా భ‌య‌ప‌డుతున్నారు. ఒక వేళ త‌ప్ప‌నిస‌రిప‌రిస్థితుల్లో రావాల్సి వ‌స్తే ఏపుగా పెరిగిన చెట్లతో ఇబ్బందులుప‌డుతున్నారు. ఏ స‌మ‌యంలో ఏం జ‌రుగుతుందోన‌ని భ‌యాందోళ‌న‌లు చెందుతున్నారు. ఇక‌నైనా సంబంధిత అధికారులు స్పందించి ప్ర‌భుత్వ కార్యాల‌యాలు ఉన్న ప్ర‌ధాన‌స‌ముదాయంలో క్లీన్ అండ్ గ్రీన్ చేప‌ట్టి ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రం చేయించాల‌ని ప‌లువురు ప్ర‌జ‌లు కోరుతున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *