
అల్లూరులో ఘనంగా కార్తీక దీపోత్సవం
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని నెల్లూరు జిల్లా అల్లూరులోని శివాలయంలో మహిళా భక్తులు కార్తీక దీపాలను వెలిగించి తమ మొక్కులను తీర్చుకున్నారు. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి సందర్భంగా వేలాది సంఖ్యలో మహిళా భక్తులు, అయ్యప్ప మాలదారులైన స్వాములు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తులు ఆలయ ఆవరణలో కార్తీక దీపాలను వెలిగించి పూజలు చేశారు. అదేవిధంగా మండలంలోని నార్త్ మోపూరు, ఇసుకపల్లి గోగులపల్లి గ్రామాల్లో వెలసిన శివాలయంలో స్థానిక మహిళా భక్తులు ప్రత్యేక పూజలు చేపట్టి కార్తీకదీపం వెలిగించి…