- ప్రతీ మంగళవారం క్యాన్సర్ కు ఉచిత స్క్రీనింగ్ టెస్ట్
- నెల్లూరు మెడికల్ హాస్పిటల్లో జాతీయ క్యాన్సర్ దినోత్సవం
మహానగరాలకు ధీటుగా క్యాన్సర్ వ్యాధికి వైద్య సేవలు అందించడంలో నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ముందుందని ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రమేష్ బాబు తెలిపారు. నెల్లూరులోని మెడి కవర్ హాస్పిటల్స్ లో జరిగిన జాతీయ క్యాన్సర్ దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ రమేష్ బాబుతోపాటు…కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ అవినాష్ , రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ హరికాంత్ లు మీడియాతో మాట్లాడారు. ప్రజలకు క్యాన్సర్ వ్యాధి నివారణకు పలు సూచనలు చేశారు. వైద్య రంగంలో వస్తున్న విప్తవాత్మకంగా మార్పుల వల్ల ఎన్నో అధునాతన వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చాయని దీంతో క్యాన్సర్ వ్యాధిని జయించవచ్చని పేర్కొన్నారు. క్యాన్సర్ వ్యాధికి నెల్లూరు మెడికవర్ కాన్సర్ ఇన్స్టిట్యూట్లో అత్యాధునిక వైద్య పరికరాలు కలిగి ఎన్నో కష్టతరమైన ఆపరేషన్లు సైతం విజయవంతం చేయగలుగుతున్నామన్నారు.
క్యాన్సర్ వ్యాధి వచ్చిన వారు రేడియేషన్ చికిత్స చేయించుకోవడానికి భయపడుతుంటారని అలాంటి వారు ధైర్యంగా రేడియేషన్ చేయించుకునే విధంగా అధునాతన చికిత్సలు మెడికవర్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వీటన్నిటికీ ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయని… ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని క్యాన్సర్ రహిత సమాజాన్ని స్థాపించేందుకు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సెంటర్ హెడ్ డాక్టర్ బిందు రెడ్డి, హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ యశ్వంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.