- గిరిజనునల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతాం
- ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి
- వెంకటాచలంలో గిరిజనుల ప్రత్యేక ప్రజా విజ్ఞాపనల పరిష్కార వేదికలో పాల్గొని అర్జీలు స్వీకరించిన
సోమిరెడ్డి, కలెక్టర్, కమిషనర్
నియోజకవర్గంలోని గిరిజనుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపి రాష్ట్రంలోనే సర్వేపల్లి నియోజకవర్గాన్ని రోల్మోడల్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చెముడుగుంట సమీపంలోని శ్రీడ్స్ కల్యాణ మండపంలో గిరిజనుల ప్రత్యేక ప్రజా విజ్ఞాపనల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, కలెక్టర్ ఆనంద్, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సూర్య తేజ, జిల్లా, మండలస్థాయి అధికారులు హాజరై గిరిజనుల నుంచి అర్జీలు స్వీకరించారు. సర్వేపల్లి నియోజకవర్గం 5 మండలాల నుంచి గిరిజనులు భారీగా తరలివచ్చారు.
గిరిజనుల అర్జీలు ఆన్ లైన్ నమోదు కోసం 15 ప్రత్యేక కౌంటర్లు, ఆధార్ కార్డుల నమోదు కోసం ఐదు ప్రత్యేక కౌంటర్లు, 25మంది సచివాలయ ఉద్యోగులతో హెల్ప్డెస్క్ ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో గిరిజనుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రత్యేక ప్రజా విజ్ఞాపనల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సోమిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు , సిబ్బంది పాల్గొన్నారు.