సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి…

  • ఎంపీపీ చింతంరెడ్డి ప‌ద్మావ‌తి
  • సీతారామ‌పురంలో ఎంపీపీ అధ్య‌క్ష‌త‌న సాధార‌ణ స‌ర్వ‌స‌భ్య స‌మావేశం

అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎంపీపీ చింతంరెడ్డి పద్మావతి సూచించారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి చింతంరెడ్డి పద్మావతి అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశం సాదాసీదాగా సాగింది. గ్రామాలలో నెలకొన్న సమస్యలు, అభివృద్ధిపై సర్పంచులు,ఎంపిటిసిలు తమ సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. వివిధ శాఖల అధికారులు,ప్రజా ప్రతినిధులు ప్రగతి నివేదికను చదివి వినిపించారు.ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడారు. విద్యుత్‌, ఇతర శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు అడిగితేనే సమస్యలు పరిష్కారిస్తాం అనే ధోరణి మానుకోవాలని సూచించారు.

సీతారామపురం బిట్ 1 ఎంపిటిసి పీసీ అల్లూరు రాజు మాట్లాడుతూ… ఉపాధి హమీలో తీవ్ర స్ధాయిలో అవకతవకలు జరుగుతున్నాయని పనికి వెళ్ళిన వారికి తక్కువ కూలీ ఇంట్లో ఉన్న వారికి ఎక్కువ కూలీ వేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జట్పిటీసి చెరుకుపల్లి రమణరెడ్డి, వైస్ఎంపిపి శారమ్మ, కృష్ణారెడ్డి,ఎంపిడిఓ భాస్కర్, ఈవోపిఆర్డి భార్గవి, ఎంఈవో మస్తాన్ వలి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *