- మెగా పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించిన జేడీ రమేష్ నాయక్, డీఎల్డీవో చైర్మన్ సోమయ్య
నెల్లూరు జిల్లా సంగం మండలం మర్రిపాడు పశు వైద్యశాలలో వెటర్నరీ డాక్టర్ సుజని మెగా పశు వైద్య శిబిరం, లేగ దూడల అందాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జాయింట్ డైరెక్టర్ రమేష్ నాయక్, డి ఎల్ డి ఓ చైర్మన్ సోమయ్య పాల్గొని మెగా పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. లేగ దూడల అందాల ప్రదర్శనను పరిశీలించారు. పలు లేగ దూడలకు,గొర్రెలకు వ్యాక్సిన్ వేశారు.ఈ సందర్భంగా పెయ్య దూడల పెంపకంపై రైతులకు పలు సూచనలు చేశారు. జాయింట్ డైరెక్టర్ రమేష్ నాయక్ మాట్లాడుతూ… ప్రభుత్వం రైతులకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని చెప్పారు.
జిల్లాలో 14 లక్షల మేకలు,గొర్రెలకు నట్టల నివారణా మందులు పంపిణీ చేశామని..ఇంకా మందుకు వేయాల్సిన వారు పశు వైద్య కేంద్రాలకు వెళ్ళాలని సూచించారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ సురేష్, డి ఎల్ డి ఓ ఈఓ శ్రీనివాస్, ఏడీ జయ చంద్ర,స్థానికులు మేకల రమణయ్య,టీడీపీ నాయకులు,వెటర్నరీ డాక్టర్లు పాల్గొన్నారు.