- జిల్లా ఆవాజ్ కమిటీ
- బుచ్చి డిప్యూటీ తహసీల్దార్కి వినతి పత్రం అందచేత
రాష్ట్రంలోనే ముస్లిం మైనారిటీల అభివృద్ధికి ఎన్నికల హామీలలో భాగంగా కూటమి ప్రభుత్వం చెప్పిన హామీలను అమలు చేసేందుకు తగినన్ని నిధులు ఈ బడ్జెట్లో కేటాయించాలని ఆవాజ్ జిల్లా కార్యదర్శి షేక్ రషీద్ తెలిపారు. జిల్లా కమిటీ పిలుపులో భాగంగా బుచ్చిరెడ్డిపాలెం మండలం కమిటీ ఆధ్వర్యంలో మండల డిప్యూటీ తహసిల్దార్ కి వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా షేక్ రషీద్ మాట్లాడుతూ… హామీలు ఇంత వరకు అమలు కాలేదని ఈ బడ్జెట్లో వాటికి నిధులు కేటాయించి సంక్షేమ పథకాలన్నీ అమలు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు.