- నెల్లూరులో ఎం ఎస్ ఎం ఇ క్లస్టర్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ని ప్రారంభించిన కలెక్టర్
విభజిత నెల్లూరు జిల్లా జిడిపి కేవలం వ్యవసాయం ద్వారా మాత్రమే పెరిగే అవకాశం ఉన్నందున, వ్యవసాయ రంగంలో అభివృద్ధికి సిడ్బి కృషి చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఆనంద్ కోరారు. నెల్లూరు నగరంలోని ప్రైవేట్ హోటల్లో ఎం ఎస్ ఎం ఇ క్లస్టర్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ను సిడ్బి స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో ఏర్పాటు చేసిన మూడు క్లస్టర్లు ఆశాజనక పురోగతిలో లేనందున, వాటి ఉత్పత్తిని పెంచే విధంగా, ఆర్ధిక వృద్ధికి సిడ్బి ఇతోధికంగా తోడ్పడాలన్నారు. సిడ్బి స్కీమ్ లో ఉన్న వారందరికీ ఆర్ధిక సహాయం అందించడం, మెరుగైన మార్కెట్ వ్యూహలను గుర్తించడం, తద్వారా వారి అవకాశాలను పెంచాలన్నారు. ఈ సమావేశంలో సిడ్బి ప్రతినిధి సురేష్, డి ఐ సి ఎడి శ్రీనివాస్, యం ఎస్ యం ఇ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.