- వేదాయపాళెం సీఐ కిషోర్కుమార్ వార్నింగ్
- 5వ నగర పోలీసు సర్కిల్ పరిధిలో ట్రాఫిక్ కంట్రోల్
ఎక్కడ పడితే అక్కడ…రోడ్లపై అడ్డదిడ్డంగా వాహనాలు నిలిపితే…పెనాల్టీలు తప్పవని వేదాయపాళెం సీఐ కిషోర్ కుమార్ హెచ్చరించారు. శాంతి భద్రత పరిక్షణలో భాగంగా… 5వ పట్టణ పరిధిలో ట్రాఫిక్ కంట్రోల్ పై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. తన సిబ్బందితో కలిసి ఇబ్బందికరంగా పార్కింగ్ చేసిన వాహనాలను గుర్తించి తీయించారు. సాధారణ ప్రజలకు, వాహన దారులకు ఇబ్బందులు కలిగేలా షాప్ ల ముందు వాహనాలు నిలిపితే వాహన దారులతో పాటు షాప్ ల యజమానులకు పెనాల్టీ లతోపాటు కేసులు తప్పవని సీఐ హెచ్చరించారు. వాహనదారులు తప్పని సరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ తిరుపతయ్య, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.