- ఎస్ఐ శ్రీనివాసరావు వార్నింగ్
- మర్రిపాడులో బెల్టు షాపులపై ఆకస్మిక దాడులు
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పొంగూరులో అక్రమంగా ఓ వ్యక్తి మద్యం అవుతున్నారని సమాచారం రావడంతో ఎస్సై శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి రాత్రి దాడులు నిర్వహించారు .ఈ దాడుల్లో పాశం కృష్ణయ్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి 26 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు లైసెన్స్ కలిగిన షాపు దారులు మాత్రమే మద్యం విక్రయించాలని ఎస్సై సూచించారు. గ్రామాల్లో బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. లైసెన్సులు కలిగిన మద్యం దుకాణదారులు… బెల్ట్ షాపుల నిర్వహకులకు సహకరిస్తే సంబంధిత షాపుల లైసెన్స్లను రద్దు చేసి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాల్లో బెల్టు షాపులు నిర్వహించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.