పిల్ల‌ల‌కి రుచిక‌ర‌మైన భోజ‌నం అందించాలి…

  • మ‌ధ్యాహ్న భోజ‌నాన్ని త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్ ఆనంద్‌
  • వింజ‌మూరులో ప‌ర్య‌టించిన క‌లెక్ట‌ర్

జిల్లాలో సుమారు 80 కోట్లతో ఉపాధి హామీ పథకం కింద పలు అభివృద్ధి పనులు ముమ్మరంగా చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ చెప్పారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలాల్లో క‌లెక్ట‌ర్‌ పర్యటించారు. ఉపాధి హామీ పనులు జరుగుతున్న తీరును స్వయంగా పరిశీలించారు. అనంతరం వింజమూరు మండలం నంది గుంటలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఉపాధి హామీ నిధులతో నిర్మిస్తున్న అంతర్గత సిమెంట్ రోడ్డు నిర్మాణాన్ని కలెక్టర్ పరిశీలించారు. నంది గుంటలోని అంగన్వాడీ ప్రీ ప్రైమరీ కేంద్రాన్ని సందర్శించి పలు రిజిస్టర్లు తనిఖీ చేశారు. విద్యార్థుల బరువు, ఎత్తు పరిశీలించారు. మండల పరిషత్ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి విద్యార్థులు కలిసి భోజనం చేశారు. కలెక్టర్ , ఆర్ డి ఓ వంశీకృష్ణ మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి రుచికరమైన భోజనం పిల్లలకి అందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖలు పరమైన అధికారులు, సర్పంచ్, నాయుకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *