- గ్యాస్ కనెక్షన్ గల ప్రతి ఒక్కరికి KYC తప్పని సరి
- నెల్లూరు జాయింట్ కలెక్టర్ కార్తీక్
గ్యాస్ కనెక్షన్ గల ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ఈ కె వై సి చేయించుకోవాలని జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ అన్నారు. KYC చేయకపోతే దీపం – 2 పధకానికి అనర్హులు అవుతారనేది కేవలం అపోహ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా నెల్లూరులోని ఆయన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. గ్యాస్ కనెక్షన్ గల వారు ఈ కె వై సి చేయకపోతే దీపం – 2 పధకానికి అనర్హులు అవుతారనేది అపోహ మాత్రమేనని, ఇందులో ఎటువంటి నిజం లేదన్నారు. అదేవిధంగా గతంలో దీపం – 1 పథకంలోని లబ్ధిదారులు, ఉజ్వల, సి యస్ ఆర్, జనరల్ క్యాటగిరి అందరూ ప్రస్తుత పధకానికి అర్హులేనని, వారి అర్హతల మేరకు ఉచిత సిలిండర్ సదుపాయం పొందవచ్చునని తెలిపారు.