- నవంబర్ 8 నుంచి కార్తీక మాస లక్ష దీపోత్సవం ప్రారంభం
- ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
- వీఆర్సీ మైదానంలో లక్ష దీపోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన వేమిరెడ్డి దంపతులు
వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో…నవంబర్ 8, 9, 10వ తేదీల్లో కార్తీక మాస లక్ష దీపోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయని..కోవూరు ఎమ్మెల్యే, టిటిడి బోర్డు మెంబర్ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరం వి. ఆర్. సి మైదానంలో జరుగుతున్న కార్తీక లక్ష దీపోత్సవ ఏర్పాట్లను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డితో కలిసి ఆమె పరిశీలించారు. లక్ష దీపోత్సవంలో పాల్గొనే భక్తులందరికి ఎక్కడా ఎటువంటి చిన్న ఇబ్బంది కూడా రాకుండా చూసుకోవాలని వేమిరెడ్డి దంపతులు…కమిటీ సభ్యులకి సూచించారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మీడియాతో మాట్లాడారు. 8వ తేదీ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం, 9వతేదీ 108 మంది దంపతులచే శ్రీ ఆంజనేయస్వామి వారికి విశేష ద్రవ్యములతో అభిషేకం, ఆకుపూజ జరుగుతుందని, అలాగే 10వ తేదీ రాత్రి శివపార్వతుల కల్యాణంతో కార్తీక మాస లక్ష దీపోత్సవం ముగిస్తుందని చెప్పారు. జిల్లా ప్రజలందరూ పాల్గొని…ఆ పరమేశ్వరి ఆశీస్సులు, దీవెనలు పొందాలని ఆమె ఆకాంక్షించారు.