గాయ‌ప‌డిన జ‌హీర్‌, ముజీర్ ల‌ను ప‌రామ‌ర్శించిన ప‌ట్టాభి

  • క్ష‌త‌గాత్రుల‌కి మెరుగైన వైద్యం అందించాలి
  • డాక్ట‌ర్ల‌కి సూచించిన రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాల శాఖ డైరెక్ట‌ర్ వేమిరెడ్డి

నెల్లూరు వెంక‌టేశ్వ‌ర‌పురం.. భ‌గ‌త్‌సింగ్ కాల‌నీ వ‌ద్ద బుధ‌వారం తెలుగుదేశం పార్టీ కి చెందిన రెండు వ‌ర్గాలు.. వ‌ర్గ పోరుతో ప‌ర‌స్ప‌రం దాడులు చేసుకున్న ఘ‌ట‌న తెలిసిందే. ఈ దాడిలో నెల్లూరు 53, 54 డివిజ‌న్ల క్ల‌స్ట‌ర్ ఇన్‌ఛార్జి జ‌హీర్‌, జ‌మీర్‌ల‌తోపాటు…ముజీర్ వ‌ర్గంలో ముజీర్‌, మునీర్‌, వారి మేన‌ల్లుడు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. జ‌హీర్ నెల్లూరు అపోలో ఆసుప‌త్రి చికిత్స పొందుతున్నాడు. ముజీర్ వ‌ర్గం నెల్లూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ విష‌యం తెలుసుకున్న రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాల శాఖ డైరెక్ట‌ర్ వేమిరెడ్డి ప‌ట్టాభిరామిరెడ్డి ఇరువురిని ప‌రామ‌ర్శించారు. గాయ‌ప‌డిన వారికి మెరుగైన వైద్యం అందించాల‌ని ఆయ‌న వైద్యుల‌కి సూచించారు. ఈ ఘ‌ట‌న‌పై ఆయ‌న ఆరా తీస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *