- ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి
- కార్పొరేషన్ కమిషనర్ సూర్యతేజని కలిసి వినతి పత్రం అందచేసిన ఎమ్మెల్సీ, వైసీపీ కార్పొరేటర్లు
నెల్లూరు నగరంలోని ప్రజా సమస్యలను పరిష్కరించాలని…కమిషనర్ సూర్యతేజని ఎమ్మెల్సీ, వైసీపీ నగర నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి కోరారు. అభివృద్ధి, పెండింగ్ పనుల విషయాలను త్వరితగతిన పూర్తి చేయాలని…ఆయన వైసీపీ కార్పొరేటర్లతో కలిసి కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ను కలిసి వినతి పత్రం అందచేశారు. జాఫర్ సాహెబ్ కెనాల్, సర్వేపల్లి కెనాల్ రివీట్ మెంట్ వాల్ ఎత్తు తక్కువగా ఉండటం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. అక్కడ గోడ ఎత్తు పెంచడం కానీ… లేదా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కమిషనర్ను కోరారు.
దీని కారణంగా అనేక ప్రమాదాలు జరిగాయన్నారు. ఇందుకు కమిషనర్ సానుకూలంగా స్పందించి ఫెన్సింగ్ని ఏర్పాటు చేస్తామని తెలియజేశారన్నారు. అలాగే 51 డివిజన్ కు చెందిన మహిళకు కారుణ్య నియామకం కింద ఉద్యోగ వసతి కల్పించే విషయంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలని కోరారు.