- వైసీపీ కన్వీనర్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి
- మరో ఇద్దరికి గాయాలు
- విచారణ సాగిస్తున్న పోలీసులు
పూతలపట్టు మండల వైసీపీ కన్వీనర్ వావిల్ తోట శ్రీకాంత్ పై…గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడిన సంఘటన…చిత్తూరు కట్టమంచిలో చోటు చేసుకుంది. ఈ దాడిలో శ్రీకాంత్తోపాటు…మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షగాత్రుల్ని వైసీపీ నాయకులు, కుటుంబ సభ్యులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో…కట్టమంచిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనా స్థలంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న చిత్తూరు వైసీపీ ఇన్చార్జి విజయానందరెడ్డి దాడిలో గాయపడ్డ వారిని పరామర్శించారు. దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ..తనపై దాడి చేసిన వ్యక్తులు అధికార పార్టీకి చెందిన వారేనని ఆరోపించారు. తనపై రాజకీయ కక్ష్యతోనే తనపై దాడి చేశారన్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు.