ఒకే ప్ర‌మాదం… మూడు వాహ‌నాలు ధ్వంసం

  • ప్ర‌మాదంలో ఇద్ద‌రు వ్య‌క్తుల‌కు గాయాలు
  • పెళ్ల‌కూరు మండ‌లం త‌ల్వాయిపాడు వ‌ద్ద రోడ్డు ప్ర‌మాదం

తిరుప‌తి జిల్లా పెళ్ల‌కూరు మండ‌లం త‌ల్వాయిపాడు గ్రామ స‌మీపంలోని జాతీయ ర‌హ‌దారిపై రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో మూడు కార్లు ధ్వంసం కాగా ఇద్ద‌రు వ్య‌క్తుల‌కు గాయాల‌య్యాయి. నాయుడుపేట వైపు వ‌స్తున్న టిప్ప‌ర్‌ను… శ్రీ‌కాళ‌హ‌స్తి నుంచి నాయుడుపేట వ‌స్తున్న కారు వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కారు ధ్వంస‌మై అందులోని వారికి గాయాల‌య్యాయి. ఈ క్ర‌మంలో ట్రాఫిక్ స్తంభించ‌గా వెనుక నుంచి వ‌స్తున్న మ‌రో కారు ఆగి ఉన్న వాహ‌నాల‌ను ఢీకొట్టింది. అదేవిధంగా ఆగి ఉన్న టిప్ప‌ర్‌ను క్రాస్ చేయ‌బోయి ఇంకో లారీ టిప్ప‌ర్‌ను ఢీకొంది. స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని క్ష‌త‌గాత్రుల‌ను నాయుడుపేట ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ మేర‌కు ద‌ర్యాప్తు చేప‌డుతున్న‌ట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *