- సీఐడీ డీఎస్పీ కోటారెడ్డి
- మర్రిపాడులో ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీల నిరోధక చట్టం 1989 పై అవగాహన కార్యక్రమం
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పొంగూరులో ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీల నిరోధక చట్టం 1989పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐడి డిఎస్పి కోటారెడ్డి పాల్గొని అవగాహనా నిర్వహించారు. ప్రతి ఒక్కరు చట్టల పై అవగాహనా కల్గి ఉంటే ఇబ్బందులు ఉండవని అన్నారు. కేసుల విషయంలో ఎస్ఐ, సీఐ స్పందించకుంటే నేరుగా డీఎస్పీని కలసి సమస్యలు పరిష్కారించుకోవచ్చని తెలిపారు. కులమాతలకు అతీతంగా అందరు సమానమని ఇది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అని తెలిపారు. కార్యక్రమంలో ఆత్మకూరు డి.ఎస్.పి వేణుగోపాల్, సీఐ గంగాధర్ రావు, ఎస్సై శ్రీనివాసరావు ,మర్రిపాడు ఇంచార్జ్ తహసిల్దార్ అనిల్ కుమార్ యాదవ్, ఎంఈఓ ధనలక్ష్మి , సిఐడి సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.