- జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్
- తిరుపతిలో ప్రపంచ క్యాన్సర్ డే
- స్విమ్స్ ఆసుపత్రి ఎంట్రన్స్ వాల్మీకి విగ్రహం వద్ద క్యాన్సర్ అవగాహన ర్యాలీ
- పాల్గొన్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోని, ముందు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా క్యాన్సర్ వ్యాధి నివారించవచ్చని జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రి ఎంట్రన్స్ వాల్మీకి విగ్రహం వద్ద క్యాన్సర్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కలెక్టర్తోపాటు స్థానిక ఎంఎల్ఏ ఆరణి శ్రీనివాసులు , ఎన్.యు.హెచ్.ఎం స్టేట్ నోడల్ ఆఫీసర్ డా. జె.విజయలక్ష్మి డీఎంఎచ్ ఓ డాక్టర్ శ్రీహరి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రతి ఒక్కరు క్యాన్సర్ వ్యాధి, నివారణ మార్గాల పై అవగాహన పెంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈ క్యాన్సర్ నివారణ చర్యలో భాగంగా ప్రజలలో అవగాహన కల్పించడం కోసం ఏఎన్ఎంలు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించి క్యాన్సర్ అనుమానిత లక్షణాలు ఉన్న వారిని గుర్తించి చికిత్స అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.