స్వ‌లాభం కోసం త‌ప్పుదారి ప‌ట్టిస్తున్నారు

తిరుపతి జిల్లా ఓజిలి మండలం ఆర్మీలపాడు క్వారీఫై కొంతమంది వ్యక్తులు స్వలాభం కోసం ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని సీఈఓ శ్రీనివాస్ సాయి ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీలో ఉన్న క్వరీలకు లేని షరత్తులు తమకు మాత్రమే ఆపాదించడం సరైన పద్దతి కాదని అన్నారు.గ్రామానికి,ప్రకృతి వనరులకు నష్టం జరగకుండా క్వారీని నిర్వహిస్తున్నామని తెలిపారు. తమకు అన్ని రకల శాఖల అధికారుల అనుమతులు ఉన్నాయని శ్రీనివాస్ తెలిపారు. నాయుడుపేటలోని తమ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో గ్రామానికి,వ్యవస్థలకి,పర్యావరణ సంరక్షణకి కట్టుబడి…

Read More

రెవెన్యూ రికార్డుల ట్యాంప‌రింగ్‌అక్ర‌మార్కుల్లో హై టెన్ష‌న్‌..!!

నెల్లూరు రూర‌ల్‌లో కొన్ని దశాబ్ధాలుగా రికార్డులు తారుమారు చేసి.. ప్ర‌భుత్వ‌, అట‌వీ, ఇరిగేష‌న్ భూముల‌ను కాజేసి.. రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో వేలాది కోట్లు దోచేశారు.. ఈ వ్య‌వ‌హారంలో అధికారులు, కొంద‌రు ప్రైవేటు వ్య‌క్తుల మెడ‌కు ఉచ్చు బిగుసుకోనుంది. భూ రికార్డుల ట్యాంప‌రింగ్‌పై కొంద‌రు కోర్టుకెక్క‌డంతో సాక్షాత్తు హైకోర్టు సీరియ‌స్ అయ్యింది. 1981 నుంచి 1995 మ‌ధ్య కాలంలో జ‌రిగిన ఈ అక్ర‌మాలు, రికార్డుల తారుమారువ‌ల్ల నేడు ఆ ప్రాంతంలో సుమారు 450 ఎక‌రాల భూమి.. రియ‌ల్…

Read More

జ‌హీర్‌కు టీడీపీ నేత‌లు ప‌రామ‌ర్శ

నెల్లూరు వెంక‌టేశ్వ‌ర‌పురం.. భ‌గ‌త్‌సింగ్ కాల‌నీవ‌ద్ద బుధ‌వారం తెలుగుదేశం పార్టీ కి చెందిన రెండు వ‌ర్గాలు.. వ‌ర్గ పోరుతో ప‌ర‌స్ప‌రం దాడులు చేసుకున్న ఘ‌ట‌న‌లో.. తీవ్రంగా గాయ‌ప‌డి.. నెల్లూరు అపోలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న నెల్లూరు 53, 54 డివిజ‌న్ల క్ల‌స్ట‌ర్ ఇన్‌ఛార్జి జ‌హీర్‌ను టీడీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కోటంరెడ్డి శ్రీ‌నివాసులురెడ్డి, రాష్ట్ర‌ వ‌క్ఫ్‌బోర్డు ఛైర్మ‌న్ అబ్ధుల్ అజీజ్‌, ఇత‌ర టీడీపీ నాయ‌కులు ప‌రామ‌ర్శించారు. దాడికిగ‌ల కార‌ణాల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం కోటంరెడ్డి, అజీజ్‌లు మీడియాతో మాట్లాడుతూ…..

Read More

దాడికి చేసిన వారిని క‌ఠినంగా శిక్షించాలి

రామన్నపాలెం కొత్తూరు గ్రామంలో వైసిపి పార్టీకి చెందిన సర్పంచ్ భర్త కాకి శ్రీనివాసులు తన అనుచరులతో కలసి టిడిపి నాయకుడు మాజీ సర్పంచ్ ఐన డేగ దయాకర్ రెడ్డి పై గ్రామసుడైన వెంకయ్య పై చేసిన దాడి ని తీవ్రంగా కండిస్తున్నామని టిడిపి నాయకుడు తువ్వర ప్రవీణ్ కుమార్ అన్నారు . కొడవలూరు మండలకేంద్రంలోని పోలీస్ స్టేష‌న్ లో దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని కోరుతూ… టిడిపి నాయకులతో కలసి డేగ దయాకర్ రెడ్డి ఎస్సై…

Read More

నీకు రైతులు తాట తీస్తారు…

ఏంది నువ్వొచ్చి పీకేది…రైతుల జోలికి వ‌స్తావా నువ్వు…ద‌మ్ముందా నీకు…అంటూ మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డికి…స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి స‌వాల్ విసిరారు. ఇక్క‌డ‌కి వ‌చ్చేందుకు నీకు ద‌మ్ములేక‌…హౌస్ అరెస్ట్ అని…పెద్ద సీన్ క్రియేట్ చేశావ‌ని కాకాణి హౌస్ అరెస్ట్ పై సెటైర్లు వేశారు. నీకు రైతులంద‌రూ తాట తీస్తార‌ని తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. నెల్లూరు జిల్లా స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం పొద‌ల‌కూరులో సోమిరెడ్డి మీడియా స‌మావేశంలో మాట్లాడారు.

Read More

రైతుల‌కి మంచి రోజులు

పొద‌ల‌కూరు మండ‌లంలోని క‌నుపూరు కాలువ రెగ్యులేట‌ర్ వ‌ద్ద‌…క‌నుపూరు కాలువ‌కి సాగునీటి విడుద‌ల కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి విచ్చేశారు. ఎమ్మెల్యేకి స్థానిక నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అధికారులు ఘ‌న స్వాగ‌తం పలికారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే కాలువ రెగ్యులేట‌ర్ వ‌ద్ద ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి…గంగ‌మ్మ‌కి సారె స‌మ‌ర్పించి రైతుల‌తో క‌లిసి క‌నుపూరు కాలువ‌కు సాగునీటిని విడుద‌ల చేశారు. అనంత‌రం ఎమ్మెల్యే సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. కూట‌మి ప్ర‌భుత్వంలో రైతుల‌కి మంచి…

Read More

హైపెక్ స‌ర్జ‌రీల‌కి కేంద్ర బిందువు నెల్లూరు మెడిక‌వ‌ర్‌

మహానగరాలకు ధీటుగా క్యాన్సర్ వ్యాధికి వైద్య సేవలు అందించడంలో నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ముందుందని ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రమేష్ బాబు తెలిపారు. నెల్లూరులోని మెడి కవర్ హాస్పిటల్స్ లో జరిగిన జాతీయ క్యాన్సర్ దినోత్సవ కార్య‌క్రమం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో డాక్ట‌ర్ ర‌మేష్ బాబుతోపాటు…కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ అవినాష్ , రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ హరికాంత్ లు మీడియాతో మాట్లాడారు. ప్ర‌జ‌ల‌కు క్యాన్సర్ వ్యాధి నివారణకు పలు సూచనలు చేశారు. వైద్య…

Read More

పథకాలు అమలుపై కలెక్టర్ ఆరా…!

కలిగిరి మండలం వెలగపాడు పంచాయతీలో కలెక్టర్ ఆనంద్ పర్యటించారు. క్షేత్రస్థాయిలోపథకాలు అమలును స్వయంగా సందర్శించారు. వెలకపాడులో నిర్మాణంలో ఉన్న గోకులం షెడ్డు ను పరిశీలించారు. అక్కడ రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పాడి పశు పోషణ లాభనష్టాలను తెలుసుకున్నారు. అదే విధంగా స్థానిక సమస్యలను అడగగా చెరువుకు సోమశిల నీరు రానివ్వకుండా అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సిమెంట్ రోడ్లు, డ్రెయిన్ కాలువల నిర్మాణం చేయించాలని కోరగా, ప్రాదాన్యత ప్రకారం మంజూరు చేస్తామని కలెక్టర్…

Read More

గాయ‌ప‌డిన జ‌హీర్‌, ముజీర్ ల‌ను ప‌రామ‌ర్శించిన ప‌ట్టాభి

నెల్లూరు వెంక‌టేశ్వ‌ర‌పురం.. భ‌గ‌త్‌సింగ్ కాల‌నీ వ‌ద్ద బుధ‌వారం తెలుగుదేశం పార్టీ కి చెందిన రెండు వ‌ర్గాలు.. వ‌ర్గ పోరుతో ప‌ర‌స్ప‌రం దాడులు చేసుకున్న ఘ‌ట‌న తెలిసిందే. ఈ దాడిలో నెల్లూరు 53, 54 డివిజ‌న్ల క్ల‌స్ట‌ర్ ఇన్‌ఛార్జి జ‌హీర్‌, జ‌మీర్‌ల‌తోపాటు…ముజీర్ వ‌ర్గంలో ముజీర్‌, మునీర్‌, వారి మేన‌ల్లుడు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. జ‌హీర్ నెల్లూరు అపోలో ఆసుప‌త్రి చికిత్స పొందుతున్నాడు. ముజీర్ వ‌ర్గం నెల్లూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ విష‌యం తెలుసుకున్న రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాల శాఖ…

Read More