త‌న్నుకున్న తెలుగు త‌మ్ముళ్లు

  • ఓ స్థ‌లం వివాదంలో కొట్టుకున్న మాజీ కార్పొరేట‌ర్‌, ప్ర‌స్తుత కార్పొరేట‌ర్‌
  • ఇరువురికి తీవ్ర ర‌క్త‌పు గాయాలు
  • వెంక‌టేశ్వ‌ర‌పురంలో ఉద్రిక్త‌త ప‌రిస్థితులు

ఓ స్థ‌ల వివాదంలో…మాజీ కార్పొరేట‌ర్‌, ప్ర‌స్తుత కార్పొరేట‌ర్ వ‌ర్గాలు ప‌ర‌స్ప‌ర దాడుల‌కు పాల్ప‌డిన ఘ‌ట‌న‌… నెల్లూరు న‌గ‌రం వెంక‌టేశ్వ‌ర‌పురంలో చోటు చేసుకుంది. ఈ దాడుల్లో… 53,54 క్ల‌స్ట‌ర్ ఇన్‌చార్జి జ‌హీర్ త‌ల‌కు తీవ్ర గాయాల‌వ‌డంతోపాటు…ఇరువ‌ర్గాల వారికి ర‌క్త‌పు గాయాల‌య్యాయి. దీంతో జ‌హీర్ ని ఆయ‌న అనుచ‌రులు చికిత్స నిమిత్తం హుటాహుటిన నెల్లూరు జీజీహెచ్‌కి త‌ర‌లించారు. మెరుగైన చికిత్స కోసం అక్క‌డి నుంచి అపోలోకు త‌ర‌లించారు. అలాగే ఈ దాడుల్లో ముజీర్ వ‌ర్గం అనుచ‌రులు కూడా గాయ‌ప‌డ్డారు. వారు ప్ర‌భుత్వ వైద్య‌శాల‌లో చికిత్స పొందుతున్నారు. ఈ దాడుల‌తో.. వెంక‌టేశ్వ‌ర‌పురంలో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. విష‌యం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని… కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *