హైస్కూల్ నుంచి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ
మెట్ట ప్రాంతమైన ఉదయగిరి జిల్లా సాధనే లక్ష్యంగా ఉదయగిరిలో ఉధృతం చేశారు. జిల్లా సాధన సమితి అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి డాక్టర్ వేణుగోపాల్, షేక్ దస్తగిరి అహ్మద్ సారథ్యంలో ఉదయగిరిలో హై స్కూల్ నుండి బస్టాండ్ వరకు భారీ జన సందోహం మధ్య జానపద కళాకారుల డప్పులతో ర్యాలీగా నిర్వహించారు. అనంతరం బస్టాండ్ వద్ద మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ… ఏళ్ల తరబడి వివక్షకు గురై అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఉదయగిరిని జిల్లా చేయాలని నాలుగేళ్లుగా ఉద్యమం చేస్తున్నా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తమ నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తూనే ఉంది అని విమర్శించారు.
విద్య వైద్యంతో పాటు అన్నిరంగంలో ఉదయగిరి అభివృద్ధి చెందాలంటే ఉదయగిరి జిల్లా చేయడమే ఏకైక మార్గమని అన్నారు. నా కల ఉదయగిరిని జిల్లా చేద్దాం, తర్వాత ఉదయగిరిలో ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్ పెట్టాలని దానికి సంబంధించి యాజమాన్యంతో మాట్లాడడం కూడా జరిగిందన్నారు. అందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమానికి తమ తెలపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాధన సమితి నాయకులు , ఎమ్మార్పీఎస్ నాయకులు, కళాకారులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.