- నెల్లూరు డీఎంహెచ్వో కార్యాలయ ఆవరణలో అగ్ని ప్రమాదం
- ఎంఎల్ ఆయిల్ నిల్వ ఉంచే వోల్డ్ బిల్డింగ్లో ప్రమాదం
నెల్లూరు నగరంలోని డీఎంహెచ్వో కార్యాలయ ప్రాంగణంలో…అగ్ని ప్రమాదం సంభవించింది. దోమల మందు, దోమలకు కాలువల్లో వేసే మడ్డి ఆయిల్ నిలువ ఉంచే పాత బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో భవనంలో నుంచి దట్టమైన నల్లటి పొగలతో పాటు….మడ్డి ఆయిల్ ఉండడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. డీఎంహెచ్వో కార్యాలయంలో ఉండే అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, స్థానిక ప్రజలు ఒక్క సారిగా భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని…రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఇది అగ్ని ప్రమాదమా…? లేక ఆకతాయిలు పనా…అనేది విచారణలో తెలియాల్సి ఉంది. ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖాధికారి మీడియాతో మాట్లాడి…అగ్ని ప్రమాదానికి గల కారణాలను వెల్లడించారు.