- దుర్వాసనతో అల్లాడిపోతున్న ప్రజలు
- సూళ్లూరుపేటలో ఘటన
- అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం
తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని జాతీయ రహదారి పక్కన వైద్య వ్యర్థాలను పడేయడంతో వాహనదారులు, ప్రజలు విస్మయానికి గురయ్యారు. వాడేసిన సిరంజిలు, సూదులు, సెలైన్ బాటిళ్లు, గ్లౌజ్లు ఇతర వ్యర్ధాలను పడేశారు. అయితే…వాటి నుంచి వస్తోన్న దుర్వాసనతో అటుగా వెళ్లే వాహన దారులతోపాటు…ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వాడేసిన మెడికల్ వ్యర్ధాలను డంపింగ్ యార్డ్ లో వేయాలని…ఇలా జన సంచారంలో పడేయడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మెడికల్ వ్యర్ధాల కారణంగా…ఎక్కడ అంటురోగాల బారిన పడుతామోనని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా…సంబంధిత అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమే…హైవే పక్కన మెడికల్ వ్యర్ధాలని…పేట వాసులు చర్చించుకుంటున్నారు. అసలు దీనికి కారణం పట్టణంలోని ప్రైవేట్ వైద్యశాలలదా…లేక ప్రభుత్వ ఆసుపత్రులదా అనేది తెలియాల్సి ఉంది