- తూపిలిపాళెం సముద్ర తీరం వద్ద సునామీపై మాక్ డ్రిల్
తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని తూపిలిపాలెం సముద్రం తీరం వద్ద… ఏపీఎస్ డిఆర్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ 9వ బెటాలియన్ వెంకటగిరి సునామీపై మాక్ డ్రిల్ నిర్వహించారు. సునామి హఠాత్తుగా సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ శాఖ,ఎస్డిఆర్ఎఫ్ బృందాలు చే ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం తహసీల్దార్ రామయ్య మాట్లాడారు. సునామీ వంటి విపత్తులు సంభవించినప్పుడు ఏ విధంగా రక్షించుకోవాలన్న దానిపై మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దువ్వూరు మధుసూదన్రెడ్డి, బీజేపీ నాయకులు పురుషోత్తంరెడ్డి, ఎంపీడీవో అన్నపూర్ణ రావు, గ్రామ ఉప సర్పంచ్ మారం రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి , మండల ఉపాధ్యక్షులు వాటం గారి వెంకటరమణయ్య, ఎస్డిఆర్ఎఫ్ అధికారి కే కృష్ణ, వాకాడు సబ్ ఇన్స్పెక్టర్ పి నాగబాబు, మెరిన్ సబ్ ఇన్స్పెక్టర్ శివ సౌమ్య, ఫైర్ ఇన్స్పెక్టర్ బి హరీష్, పలువురు అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.