- శ్రీ చెంగాళమ్మ సన్నిధిలోని నాగేంద్రుని పుట్ట వద్ద కిక్కిరిసిన మహిళ భక్తులు
- ఏర్పాట్లను పర్యవేక్షించిన ఆలయ సహా కమిషనర్ ప్రసన్న లక్ష్మి
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం వ్యాప్తంగా నాగుల చవితి వేడుకలను ఘనంగా జరిగాయి. మంగళవారం వేకువజాము నుంచే పలు దేవాలయాల్లో మహిళలు నాగేంద్రుని పుట్ట వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో భాగంగా పట్టణంలోని శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయ ఆవరణంలో ఉన్న నాగేంద్రుని పుట్ట వద్ద పెద్ద సంఖ్యలో మహిళలు కుటుంబ సభ్యులతో కలిసి తెల్లవారుజాము నుంచి బారులు తీరారు. నాగేంద్రుని శిలలకు, పుట్ట వద్ద పూజలు చేసి పాలతో అభిషేకాలు, నైవేద్యాలు సమర్పించి పుట్ట చుట్టూ దారం చుట్టి కొబ్బరికాయలు కొట్టి హారతులు ఇచ్చారు. మహిళలు చీరలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులు చెంగాలమ్మ చెట్టుకు పూజ చేసి అమ్మవారి దర్శించుకున్నారు. పుట్ట వద్ద పెద్ద సంఖ్యల భక్తులకు కిటకిటలాడింది. ఆలయ సహా కమిషనర్ ప్రసన్న లక్ష్మి నేతృత్వంలో నాగుల చవితి కోసం ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహించారు