- జిల్లా వైద్యాధికారి డాక్టర్ పెంచలయ్య
- సంగం పీహెచ్సీని సందర్శించిన డీఎంహెచ్వో
నెల్లూరు జిల్లా సంగం పి హెచ్ సి ని జిల్లా వైద్యాధికారి పెంచలయ్య సందర్శించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది తో సమీక్షా సమావేశం నిర్వహించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. గ్రామాలలో ఫీవర్ సర్వే నిర్వహించి నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలు విష జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండి..నివాసాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో విష జ్వరాల పై సిబ్బందిని అప్రమత్తం చేసి నివారణా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు కాచి చల్లార్చిన నీటినే తాగాలని సూచించారు. నివాసాల మధ్య నీటి నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాసులు రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.