- టీడీపీ తీర్ధం పుచ్చుకున్న మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్
- సీఎం చంద్రబాబు సమక్షంలో చేరిక
చిత్తూరు జిల్లా కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ షాక్ తగిలింది. కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ వైసీపీ రాజీనామా చేసి…తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నాయుడును డాక్టర్ సుధీర్ కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. సుధీర్కి సీఎం చంద్రబాబు పార్టీ కండువా కప్పి టీడీపీలో సాదరంగా ఆహ్వానించారు. వైసీపీకి, మున్సిపల్ ఛైర్మన్, కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేసిన అనంతరం సుధీర్ టీడీపీలో చేరారు. సీఎం చంద్రబాబుతో కలిసి నడిచేందుకే అన్ని పదవులకు రాజీనామా చేశానని సుధీర్ తెలిపారు..