కాశీ ఘాట్ ను తలపించే రీతిలో గణేష్ ఘాట్

  • 108 తెప్పలతో శివాకృతి కార్యక్రమం
  • నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

న‌వంబ‌ర్‌ 15వ తేదీన సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కార్తీక దీపోత్సవ కార్యక్రమం జరుగుతుందని…రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియాజకవర్గ పరిధిలోని 41వ డివిజన్, గణేష్ ఘాట్ లో కార్తీక మహా దీపోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను….నగర కమీషనర్ సూర్యతేజ, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిల‌తో క‌లిసి ఆయ‌న ప‌రిశీలించారు. అనంత‌రం ఆయ‌న కార్తీక దీపోత్స‌వంపై స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే శ్రీ‌ధ‌ర్‌రెడ్డి మాట్లాడుతూ….సింహపురి కార్తీక దీపోత్సవ సమితి చేపట్టిన ఈ పవిత్ర కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యుడిగా అన్నిరకాలుగా అండగా ఉంటాన‌న్నారు. 108 తెప్పలతో శివాకృతి కార్యక్రమం జరుగుతుంద‌న్నారు. కాశీ ఘాట్‌ను త‌ల‌పించే రీతిలో గ‌ణేష్ ఘాట్ ను తీర్చిదిద్దుతామ‌ని చెప్పారు. అనంత‌రం క‌మిష‌న‌ర్ మాట్లాడారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రతి కార్యక్రమాన్ని వినూత్నంగా చేస్తార‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో కార్పొరేట‌ర్‌, సింహ‌పురి కార్తీక దీపోత్స‌వ స‌మితి నాయ‌కులు, స‌భ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *