- N3కి కృతజ్ఞతలు తెలియజేసిన విద్యార్థులు, ప్రయాణికులు
ఉమ్మడి నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలంలో ప్రమాదకరంగా హోర్డింగ్లు…భయాందోళనలో విద్యార్థులు, ప్రయాణికులు అన్న కథనాన్ని ఎన్3 న్యూస్ ప్రచురించింది. ఈ కథనానికి సంబంధిత అధికారులు స్పందించారు. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముందు, బాలికల గురుకుల పాఠశాల ప్రాంగణం ఎదుట ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యం పెద్ద పెద్ద హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. ఈ హోర్డింగ్లు ప్రమాదకరంగా మారాయని విద్యార్థులు, ప్రయాణికులు తెలియజేశారు. దీనిపై ఎన్3 న్యూస్ ప్రతినిధి కథనాన్ని ప్రచురించారు. కథనం ప్రసారమవడంతో సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఆ హోర్డింగ్లను తొలగించారు. దీంతో విద్యార్థులు, ప్రయాణికులు, గ్రామస్థులు ఎన్3 న్యూస్కి ధన్యవాదాలు తెలియజేశారు.