- పాముకాటుతో విద్యార్థి మృతి
- గ్రామంలో విషాదఛాయలు
పాముకాటుతో 14 ఏళ్ల పంటరంగం చరణ్ బాలుడు మృతి చెందిన ఘటన… తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెంలో చోటు చేసుకుంది. రాత్రి సమయంలో బాలుడు ఇంట్లో నిద్రిస్తుండగా పాము కాటు వేయడంతో కుటుంబ సభ్యులు అతన్ని హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు..హాస్పిటల్ లో చికిత్స పొందు మృతి చెందాడు. హాస్పిటల్లో సకాలంలో వైద్యం అందక సరైన మందులు లేకనే ..మా బిడ్డ చనిపోయాడని మృతుడు కుటుంబ సభ్యులు ఆరోపించారు. చరణ్ బాలిరెడ్డిపాళెం జడ్పీ హూస్కూల్లో పదో తరగతి చదువుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలు ముకున్నాయి…