వర్గీకరణ వద్దు..ఐక్యతే ముద్దు…

  • అల్లూరులో మాల‌ల మ‌హాగ‌ర్జ‌న‌

ఎస్వీ వర్గీకరణ వద్దని… ఎస్సీలంతా కలిసి ఉండటమే ముద్దుగా ఉంటుందని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు అన్నారు. నెల్లూరు జిల్లా అల్లూరులో జరిగిన మాలల మహా గర్జన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొలుత స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎస్సీలను విడగొట్టాలన్న ప్రయత్నం చేస్తుందని విమ‌ర్శించారు. ఇందులో భాగంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా మాలలంతా ఐక్యంగా కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏళ్ళు సాల్మన్ రాజు, కరుణాకర్, సుధ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *