- కుప్పంలో ఘనంగా శ్రీ సద్గురు యోగి నారాయణ విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ
చిత్తూరు జిల్లా కుప్పం పట్టణ పరిధిలోని చెరువు కట్ట వద్ద కైవారం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న శ్రీ సద్గురు యోగి నారాయణ విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ చేతుల మీదుగా భూమి పూజ చేశారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం మాట్లాడుతూ…. కుప్పంలో శ్రీ యోగి నారాయణ విగ్రహన్ని కైవారం ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిష్టించడం శుభపరిణామం అన్నారు. తెలుగుదేశం పార్టీ తరపున అన్ని సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సురేష్ బాబు, రాష్ట్ర కార్యదర్శి గోపీనాథ్, రాజ్ కుమార్, ఏఎంసీ ఎక్స్ చైర్మన్ సత్యేంద్ర శేఖర్,గంగమ్మ దేవాలయం మాజీ డైరెక్టర్ మంజునాథ్ జనసేన నేత నరేష్ , కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.