మ‌హా ప‌డిపూజ‌లో మంత్రి నారాయ‌ణ‌

అయ్య‌ప్ప‌స్వామికి విశేష పూజ‌లు నిర్వ‌హించిన మంత్రి

నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్ పేట లక్ష్మీపురంలో ఆదివారం రాత్రి అయ్యప్ప మహపడిపూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు . ఈ సందర్భంగా మహాపడి పూజ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామియే శరణం అయ్యప్ప.. శరణంశరణం అయ్యప్ప.. స్వామి శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణతో ఆ ప్రాంతం మార్మోగింది. ఈ మహపడిపూజ మహోత్స వానికి పెద్దఎత్తున అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొని అయ్యప్ప నామస్మర ణం, భజన పాటలు, భక్తి గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నారాయణ విద్యా సంస్థల జిఎం విజయభాస్కర్ రెడ్డి.. స్థానిక టిడిపి నేతలు, పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వామి మాల ధారణ భక్తులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *