- బస్సులోనే అనుమానాస్పదంగా మృతి చెందిన క్లీనర్
- మృతుడు గడ్డం రమేష్ భార్యతో మాట్లాడిన N3 ప్రతినిధి రబ్బానీ
నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం ముస్తాపురం గ్రామానికి చెందిన రమేష్ ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లో క్లీనర్ గా పని చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అక్టోబర్ 31వ తేదీన ఇంటి నుంచి బయలుదేరి 1వ తేదీన హైదరాబాద్ కు చేరుకున్నాడు. సాయంత్రం హైదరాబాద్ నుంచి ఏఎస్ పేట కు వస్తున్న బస్ క్లీనర్ బస్సులో ప్రయాణిస్తున్న గడ్డం రమేష్ మార్గమధ్యలో మృతి చెందాడని కుటుంబ సభ్యులకు బస్సు సిబ్బంది సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు. రమేష్ మృతదేహాన్ని ఇంటికి తీసుకొని వచ్చి తీవ్ర ఆవేదనకు గురయ్యారు