- ఓ గిరిజన మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ పంచాయతీ సెక్రటరీ
- స్పందనలో నెల్లూరు కలెక్టర్కు ఫిర్యాదు
- ఎన్-3ని ఆశ్రయించిన బాధితురాలు
తండ్రి డెత్ సర్టిఫికేట్ కోసం ఓ గిరిజన మహిళ ఆరు నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. కాళ్లావేళ్లా పడి వేడుకుంటున్నా.. మంజూరు చేయకుండా.. ఏదో ఒక కొర్రి పెడుతూ.. చివరకు డెత్ సర్టిఫికేట్ కావాలంటే.. వీడియో కాల్ చేయాలి.. అన్నీ చూపించాలి.. నా దగ్గరకు రావాలి.. డబల్ బెడ్రూం ఉంది.. కోరిక తీర్చు.. నీ పని చేసి పెడతానంటూ ఓ పంచాయతీ సెక్రటరీ లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వైనం ఇది.. అతడి విక్రుత చేష్టలకు.. లోలోన బాధపడుతూ.. ఎలాగైనా తండ్రి డెత్ సర్టిఫికేట్ కావాలని ఆ ప్రబుద్ధిడితో ఆ మహిళ ఇబ్బంది పడుతూనే మాట్లాడుతుంటే.. శుతిమించి వ్యవహరిస్తూ.. ఫోన్లోనే తన వద్దకు రావాలని.. కోరిక తీర్చాలని వేధిస్తున్న వైనం ఇది. ఆ బాధిత మహిళ నేడు నెల్లూరు కలెక్టరేట్లో.. నేరుగా కలెక్టర్ వద్దకు వచ్చి.. జరిగిన విషయాన్ని వెళ్లడించి.. బోరున కన్నీరుమున్నీరైంది. తను.. ఆ పంచాయతీ అధికారి అసభ్యకరంగా మాట్లాడిన మాటలు.. తనపై ఏ విధంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడో అవన్నీ.. రికార్డు చేసి మరీ అధికారులకు అందజేసి.. తనకు న్యాయం చేయాలని.. అతడిపై చర్యలు తీసుకోవాలని కోరిన వైనం ఇది.
నెల్లూరు జిల్లా.. రాపూరు పంచాయతీకి చెందిన ఓ గిరిజన మహిళ తండ్రి గత కొంత కాలం మృతి చెందాడు. అతడికి సంబంధించిన ఆస్తి, ఇతర లావాదేవీలు కుటుంబ సభ్యులకు చెందాలంటే.. బ్యాంకులకు, సంబంధిత అధికారులకు డెత్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంది.ఈ సర్టిఫికేట్ కోసం ఓ గిరిజన మహిళ ఆరు నెలల క్రితం రాపూరు అధికారులకు దరఖాస్తు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న రాపూరు మండలం.. సిద్ధవరం పంచాయతీ సెక్రటరీ చెంచయ్య.. ఆ మహిళపై కన్నేశాడు. ఏదో విధంగా ఆమెను లోబర్చుకోవాలని.. పన్నాగం పన్నాడు. సర్టిఫికేట్ కోసం ఓ సారి ఈ చెంచయ్యకు ఫోన్ చేసింది. అంతే.. మాట మాటా కలిపాడు.. ఆమె మర్యాదగా.. మంచిగా మాట్లాడుతుంటే.. దాన్ని అలుసుగా తీసుకుని.. ఆమెను లైంగికంగా లోబర్చుకునేందుకు యత్నిస్తూ.. సర్టిఫికేట్ కావాలంటే.. వీడియో కాల్ చేయాలని.. అన్నీ చూపించాలంటూ.. ఒత్తిడి చేస్తుండటం.. గూడూరులో డబుల్ బెడ్రూం ఇల్లు ఉందని.. ఎవరూ ఉండరని.. అక్కడికి వస్తే.. పని చూసుకుని.. సర్టిఫికేట్ ఇస్తానంటూ.. ఆమెను ప్రలోభ పెట్టంతో ఆమె మంచిగానే మాట్లాడి.. ఎలాగైనా అతడికి బుద్ధి చెప్పాలని.. మొదటి నుంచి అతడు మాట్లాడే మాటలన్నీ రికార్డు చేసి.. సోమవారం నెల్లూరు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. ఆయా రికార్డులన్నీ కాపీ చేసి.. కలెక్టర్కు అందజేసి.. న్యాయం చేయాలని వేడుకుంది. అంతేకాకుండా బాధితురాలు ఎన్-3ని ఆశ్రయించింది. ఈవిషయంలో జిల్లా కలెక్టర్ స్పందించి… ఆ పంచాయతీ సెక్రటరీపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.