ఆ బాధ్య‌త మాతోపాటు అధికారుల‌పై ఉంది – ఎమ్మెల్యే సోమిరెడ్డి

  • వెంక‌టాచ‌లంలో ప్ర‌త్యేక ప్రజా విజ్ఞాప‌న‌ల కార్య‌క్ర‌మం
  • ప్ర‌జ‌ల నుంచి అర్జీలు స్వీక‌రించిన సోమిరెడ్డి, ఆర్డీవో నాగ సంతోష్ అనూష
  • ప్రత్యేక గ్రీవెన్స్ కు పోటెత్తిన ప్రజానీకం

ఇప్పుడున్నది ప్రజల కోసం పనిచేస్తున్న మంచి ప్రభుత్వం అని…ప్రతి సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత మాతో పాటు అధికారులపై ఉందని స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే ఆధ్వ‌ర్యంలో నెల్లూరు జిల్లా వెంక‌టాచ‌లం మండ‌ల ప‌రిష‌త్ కార్యాల‌యంలో ప్రత్యేక ప్రజావిజ్ఞాపనల కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆయ‌న ఆర్డీవో నాగ సంతోష్ అనూష, మండ‌ల అధికారుల‌తో క‌లిసి ప్ర‌జ‌ల నుంచి అర్జీలు స్వీక‌రించారు.

ఈ సంద‌ర్భంగా సోమిరెడ్డి ప్ర‌తీ ఒక్క‌రిని ఎంతో ఆప్యాయంగా ప‌ల‌క‌రించి స‌మ‌స్య‌ల‌పై ఆరా తీశారు. ఈ కార్య‌క్ర‌మంలో అర్జీల‌ను వ‌చ్చే నెల రోజుల్లో సాధ్యమైన సమస్యలన్నీ పరిష్కరించాలని ఆయ‌న అధికారుల్ని ఆదేశించారు. మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటగా వెంకటాచలంలో స్పెషల్ గ్రీవెన్స్ డే నిర్వహించామ‌న్నారు. వందలాది మంది అర్జీలతో బారులుదీరారంటే…గత ప్రభుత్వం ప్రజల కోసం ఏ స్థాయిలో పనిచేశారో అర్థమవుతోందని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *