
బధిరులు, అంధులకి మొబైల్స్, లాప్ టాప్స్ పంపిణీ
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బధిరులు, అంధులకు జిల్లా కలెక్టర్ ఆనంద్ చే మొబైల్ ఫోన్స్, లాప్ టాప్ ల పంపిణీ చేశారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బధిర, అంధ విద్యార్థిని విద్యార్థులకు మొత్తం 3,95,000 రూపాయల విలువ కలిగిన 10 మొబైల్ ఫోన్లు, 7 లాప్ టాప్ లను విభిన్న ప్రతిభా వంతుల శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతిభా వంతుల శాఖ అధికారులు, కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.