- పొట్టేపాళెంలో బ్రిడ్జిని వెంటనే మంజూరు చేయాలి
- జడ్పీ డీఆర్సీ సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి
నెల్లూరు రూరల్ పరిధిలోని పొట్టేపాలెం కలజు మీద బ్రిడ్జిని వెంటనే మంజూరు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపించాలని…అధికారుల్ని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కోరారు. నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన డీఆర్సీ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నెల్లూరు రూరల్లో మూడు బ్రిడ్జిలు యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాలన్నారు. మంచి ప్రభుత్వం అధికారంలో ఉందని… అధికారులు సమన్వయం చేసుకొని పనులు చేయాలని కోరారు. జగన్ ప్రభుత్వంలో మంజూరు అయ్యాయని…నేను పార్టీ నుంచి బయటకు రావడంతో వాటిని ఆపేశారని పేర్కొన్నారు. అలాగే రూరల్లో పలు సమస్యల పరిష్కారం కోసం ఈ సమావేశంలో శ్రీధర్రెడ్డి తన గళాన్ని వినిపించారు