మాలల మహా గర్జనను జయప్రదం చేయండి

  • అంబేద్కర్ యువజన సంఘ రాష్ట్ర నాయకులు పిలుపు
  • అల్లూరులో ర్యాలీలు

నవంబర్ 4వ తేదీన అల్లూరు అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టనున్న మాలల మహా గర్జన సభను జయప్రదం చేయాలని అంబేద్కర్ యువజన సంఘ రాష్ట్ర నాయకులు ముసలి నరేంద్ర, ఎల్లు సాల్మన్ రాజు కోరారు. ఈ మేరకు అల్లూరు మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న మాలల కాలనీలో ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… అన్నదమ్ములుగా ఉన్న మాల మాదిగలను విడగొట్టే ప్రయత్నంలో భాగంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పు క్రిమిలేయర్ వంటి వాటిపై అవగాహన కల్పిస్తూ ఈ నెల నాలుగో తేదీన గర్జన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. వేలాదిమందిగా మాల సోదరులు పాల్గొని జయప్రదం చేసి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పొంగుళూరు సుధాకర్, గంగపట్నం సతీష్ చెంతాటి కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *