- సంపద సృష్టించడంలో ప్రపంచం దేశాలలో టాప్ -5లో భారత్
- నైపుణ్య గణన శిక్షణా కార్యక్రమంలో బుచ్చి ఎంపీడీవో శ్రీహరి
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యువత కలిగిన దేశం భారతదేశమనీ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం ఎంపీడీవో శ్రీహరి అన్నారు.. మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు సచివాల సిబ్బందితో నైపుణ్య గణన శిక్షణా కార్యక్రమం నిర్వహణ జరిగింది.. యువతలో నైపుణ్యాలు గుర్తించేందుకు కూటమి ప్రభుత్వం అడుగులేస్తుందని చెప్పారు.. ఇందులో భాగంగా ఆయా గ్రామాల్లో నైపుణ్య గణన సర్వే చేపట్టాలని సిబ్బందిని సూచించారు.. సర్వే చేయాల్సిన అంశాలపై శిక్షణ ఇచ్చారు.. సర్వేల్లో ప్రధానంగా విద్యార్థులు సామాజిక ఆర్థిక స్థితిగతులు ప్రస్తుతం ఉపాధి వివరాలు, నైపుణ్యాలు తదితరాలకు సంబంధించి 25 రకాల ప్రశ్నలకు సమాచారం సేకరించాలనీ తెలిపారు.. సర్వేలో ఆయా వ్యక్తుల విద్యార్హతలు, ఉద్యోగం అనుభవం, ఉద్యోగ ఆసక్తి, తదితర వివరాలను నమోదు చేయాలన్నారు.. సంపద సృష్టించడంలో ప్రపంచ దేశాల్లో టాప్-5లో భారతదేశం ఉందన్నారు..ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాసులు..ఈవోపీఆర్డీ నారాయణరెడ్డి ఉన్నారు.