నాయుడుపేట ఎన్టీఆర్‌కాల‌నీలో కార్టెన్‌సెర్చ్‌

  • కార్మికుల‌కు కౌన్సిలింగ్ ఇచ్చిన డీఎస్పీ చెంచుబాబు

తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు పరిశ్రమవాడలో డీఎస్పీ చెంచుబాబు కార్టెన్‌స‌ర్చ్‌ నిర్వహించారు. ఎన్టీఆర్ కాలనీలో ఎక్కువగా నివసిస్తున్న ఇతర రాష్ట్రాల‌ కార్మికుల ఇళ్లలో అడుగ‌డుగున సోదా చేశారు. ఆ ప్రాంతంలోని అన్ని వాహనాల పత్రాలు, పరిసరప్రాంతాలలో క్షుణ్ణంగా ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా డీఎస్పీ చెంచుబాబు, సీఐ బాబి ఆధ్వ‌ర్యంలో కార్మికులకి కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రధానంగా మాదక ద్రవ్యాలు, అపరిచిత వ్యక్తులు, అనుమానిత వాహనలను దృష్టిలో ఉంచుకుని తనిఖీలు చేప‌ట్టిన‌ట్లు డీఎస్పీ చెంచుబాబు తెలియ‌జేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *