- జయప్రదం చేయాలని ఇందుకూరుపేట సీపీఎం నేతలు పిలుపు
నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో డిసెంబర్ 14,15 తేదీలలో సీపీఎం 25వ మహాసభలు జరుగుతాయని మండల కార్యదర్శి కోటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం నేతలు మండలంలో పర్యటిస్తూ…ఇంటింటికెళ్లి మీ వంతు ఆర్ధిక సహాయ సహకారాలు అందించాలని…సీపీఎం 25వ మహాసభలను జయప్రదం చేయాలని వారు కోరారు. అనంతరం కోటేశ్వరరావు మాట్లాడుతూ… నిరంతరం ప్రజా సమస్యలపై సీపీఎం పార్టీ ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేస్తోందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు వాసు, దయాసాగర్, పేడూరు మల్లికార్జున, రామారావు, తదితరులు పాల్గొన్నారు.