- మీడియాతో మాట్లాడిన ఎంపీ గురుమూర్తి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట టీడీపీ నాయకులపై వైసీపీ ఎంపీగురుమూర్తి, మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య ఫైర్ అయ్యారు. పెళ్లకూరు మండలం చిల్లకూరు గ్రామంలో వారు మీడియాతో మాట్లాడారు. పోలీసులు సహకారంతో వైసీపీ నాయకులపై హత్యలకి పాల్పడయతున్నారంటూ మండిపడ్డారు. తమ పార్టీ కార్యకర్త హత్యపై హైకోర్టు ఉత్తర్వులను సైతం పోలీసులు ఉల్లంఘిస్తున్నారంటూ కిలివేటి అగ్రహాం వ్యక్తం చేశారు. పెళ్లకూరు మండలం చిల్లకూరులో వైసీపీ సీనియర్ నాయకుడు సత్యనారాయణ రెడ్డి ఇంటి వద్ద జరిగిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.