చేనేత కార్మికుల‌కి అండ‌గా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు

  • వింజ‌మూరులో జిల్లా హ్యాండ్లూమ్ అండ్ టెక్స్ టైల్స్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌

నెల్లూరు జిల్లా వింజ‌మూరులో జిల్లా హ్యాండ్లూమ్ అండ్ టెక్సటైల్ అసిస్టెంట్ డైరెక్టర్ వరప్రసాద్, చేనేత శాఖ అభివృద్ధి అధికారిని మాధవిలతలు ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా వారు మండ‌లంలోని చేనేత కార్మికుల్ని క‌లిసి కేంద్ర ప్ర‌భుత్వం అందించే రాయితీని వారికి వివ‌రించారు. గ‌త వైసీపీ ప్ర‌భుత్వంలో చేనేత కార్మికుల‌కి రాయితీల అంద‌క‌పోవ‌డంతో కార్మికుల జీవ‌నం అస్త‌వ్య‌స్తంగా త‌యారైంద‌ని విమ‌ర్శించారు. ఇప్పుడు కూట‌మి ప్ర‌భుత్వం చొర‌వ‌తో…హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స‌టైల్స్ రంగాల‌కు ఊర‌ట క‌లుగుతుంద‌ని చేనేత కార్మికుల‌కి తెలియ‌జేశారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చేనేత కార్మికుల అండ‌గా ఉంటాయ‌ని చెప్పారు. ఈ కార్యక్రమంలో టెక్సటైల్ అధికారులు, బీసీ కాలనీ చేనేత కార్మికులు, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *