ఎంపీ అంటే లెక్క‌లేదా…అగౌరప‌రుస్తారా…

  • జ‌డ్పీ స‌మావేశం వేదిక‌పై నుంచి అలిగిపోయిన నెల్లూరు ఎంపీ
  • ఎంపీని స‌ముదాయించేందుకు ప్ర‌య‌త్నించిన ఆనం, క‌లెక్ట‌ర్‌, సోమిరెడ్డి

నెల్లూరు జిల్లా ప‌రిష‌త్ స‌మావేశ మందిరంలో…డీఆర్సీ స‌మావేశం జ‌రుగుతోంది. ఈ స‌మావేశంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ నేప‌థ్యంలో వేదిక‌పై ఎంపీకి గౌర‌వం ద‌క్క‌లేద‌ని ఆయ‌న స‌భ నుంచి వెళ్లిపోయారు. వెంట‌నే ఎంపీ వేమిరెడ్డిని స‌ముదాయించేందుకు మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, క‌లెక్ట‌ర్ ఆనంద్‌, ఎమ్మెల్యే సోమిరెడ్డిలు ప్ర‌య‌త్నించారు. నేను వెన‌క్కి రాలేన‌ని ఖ‌రాకండిగా చెప్పేసి జ‌డ్పీ నుంచి ఆయ‌న‌ వెళ్లిపోయారు. అక్క‌డే ఉన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి సైతం ఎంపీ వెంట వెళ్లిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *