రైతుల‌కి సాగునీరందించేందుకు చ‌ర్య‌లు

  • క‌నుపూరు కాలువ‌లో పూడిక ప‌నుల‌ను ప‌రిశీలించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి

నెల్లూరు జిల్లా సంగం బ్యారేజి వద్ద కుడి వైపు ఉన్న కనుపూరు కాలువలో పూడిక తొలగింపు పనులను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు. పనుల పురోగతి గురించి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. పనులు వేగంగా పూర్తి చేసి రైతులకు సాగు నీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రూ.28 కోట్లతో జిల్లాలో 438 పనులు జరగడం చారిత్రాత్మకమని అన్నారు.

ఈ ప్రభుత్వ పని తీరు, పారదర్శకతకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. గతంలో రూ.185 కోట్లతో కనుపూరు కాలువను ఇతర సాగునీటి వనరుల అభివృద్ధి పనులను చేసామంటూ కాకాని గోవర్ధన్ రెడ్డి దోపిడీ చేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, బ్యారేజి ఈ ఈ అనీల్ కుమార్ రెడ్డి,కనపూరు కాలువ డిఈ శంకర నారాయణ , ఏ ఈ శ్రీకాంత్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *