- గౌతమ్రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన కుటుంబ సభ్యులు, నియోజకవర్గ నేతలు
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని మర్రిపాడు వైసీపీ కార్యాలయం, బ్రాహ్మణపల్లి లోని మేకపాటి నివాసంలో దివంగత మాజీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి 53వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఉదయగిరి ఆత్మకూరు నియోజకవర్గాలకు చెందిన వైసిపి నాయకులు కార్యకర్తలతో కలిసి మేకపాటి కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. అనంతరం మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి, ఉదయగిరి వైసీపీ ఇన్చార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి, మేకపాటి అభిమానులు తదితరులు పాల్గొన్నారు