- మద్యం తాగి బస్సు ఎక్కెందుకు ప్రయత్నించిన లాజరు అనే వ్యక్తి
- అడ్డుకున్న డ్రైవర్
- కావలిలో శుక్రవారం రాత్రి ఉద్రిక్తత
ఓ ప్రయాణికుడిపై బస్సు డ్రైవర్ దాడికి పాల్పడిన ఘటన… నెల్లూరు జిల్లా కావలిలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. లాజర్ అనే ప్రయాణికుడు మద్యం తాగి బస్సు ఎక్కే ప్రయత్నం చేశాడు. దీంతో డ్రైవర్ అతన్ని అడ్డుకున్నాడు. తాగి బస్సు ఎక్కకూడదని చెప్పడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో డ్రైవర్ తనను కొట్టడంతో పన్ను విరిగి నోటి నిండా రక్తస్రావమైందని లాజర్ ఆరోపించారు. ఆయన కుటుంబ సభ్యులు రోడ్డు మీద బైఠాయించారు. పోలీసులు బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.